www.ntodaynews.com
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ
/
హైదరాబాద్
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
అనారోగ్యంతో హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు.
ఆస్పత్రికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ వేం నరేందర్ రెడ్డి కూడా గవర్నర్ను పరామర్శించారు.
గవర్నర్కు అందిస్తున్న వైద్య సేవలు, ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులు వివరాలు అందించినట్లు సమాచారం. ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం పర్యవేక్షిస్తోంది.