www.ntodaynews.com
హైదరాబాద్ : రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్కచెల్లెళ్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
తెలంగాణ
రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అక్కచెల్లెళ్లకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని సీఎం కోరుకున్నారు.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం, ఆడబిడ్డలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే బృహత్ సంకల్పంతో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.