హైదరాబాద్లో జాతీయ జెండాకు అవమానం.. నాగోల్ మూసీ వద్ద నేలపై పడిన త్రివర్ణ పతాకం
హైదరాబాద్లో జాతీయ జెండాకు అవమానం.. నాగోల్ మూసీ వద్ద నేలపై పడిన త్రివర్ణ పతాకం
హైదరాబాద్లోని నాగోల్ మూసీ రివర్ఫ్రంట్ ప్రాంతంలో జాతీయ జెండా నేలపై పడిపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా జెండా స్తంభానికి అమర్చిన ఇనుప గొలుసులు (రోపులు) తెగిపోవడంతో త్రివర్ణ పతాకం చిరిగి నేలపై పడింది.
ఈ ఘటన జరిగినప్పటికీ మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఇప్పటివరకు మరమ్మత్తులు చేపట్టకపోవడం, జెండాను తిరిగి ఎగురవేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ జెండా గౌరవాన్ని కాపాడడంలో అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన స్థానికులు, ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, జెండాను తక్షణమే గౌరవప్రదంగా పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.