హనుమకొండ కలెక్టరేట్లో ప్రజావాణి
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా కలెక్టర్
హనుమకొండ | Ntoday News
హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులను జిల్లా కలెక్టర్కు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను పరిశీలించారు. సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం వేదికగా నిలుస్తుందని అధికారులు తెలిపారు.