ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలకు పెద్దపీట
--భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైసు రాజేష్ పైలెట్
NTODAY NEWS: బొమ్మలరామారం.
ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడు కోటీశ్వరుడు కావాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం చేస్తుందని భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైసు రాజేష్ పైలెట్ అన్నారు. బొమ్మ లరామారం మండలం, రంగాపురం రెవెన్యూ పరిధిలో గురువారం రోజున లబ్ధిదారునికి రెండో విడతలో మంజూరైన నూతన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడి అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు ప్రజా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలందరికీ సమన్యాయం జరుగుతుందని అన్నారు అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు తో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు ఈ కార్యక్రమంలో రంగాపూర్ నూతన సర్పంచ్ యంజాల సరస్వతి గణేష్,రంగాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఇందిరమ్మ ఇల్లు మంజూరైన కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube