BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

ఇరుముడి సినిమాపై వివాదం....

వినోదం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 04:39 PM
31 వీక్షణలు

ఇరుముడి’ సినిమాపై వివాదం.. వివాదాస్పద సన్నివేశాలు తొలగించాలని ఏపీటీఎఫ్ డిమాండ్

‘రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’ విడుదలైన వెంటనే మంచి ఆదరణతో దూసుకెళ్తోంది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతుండగా.. మరోవైపు అనుకోని వివాదంలో చిక్కుకుంది.

ఈ సినిమాలో ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల వ్యవస్థను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉపాధ్యాయుల గౌరవాన్ని దెబ్బతీసేలా చిత్రీకరణ చేయడం సరికాదని, వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేసింది.

ఏపీటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ.. సినిమాలో ఉపాధ్యాయుడి పాత్రను ప్రతికూలంగా చూపించారని ఆరోపించారు. ముఖ్యంగా ఉపాధ్యాయురాలి పాత్రకు సంబంధించిన సన్నివేశాల్లో కనిపించే పాఠశాల, విద్యార్థుల దుస్తులు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను పోలి ఉండటం అభ్యంతరకరమని పేర్కొన్నారు.

ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా సన్నివేశాలు ఉండటం బాధాకరమని అన్నారు. సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే ఉపాధ్యాయులను తక్కువ చేసి చూపించడం సరైన విధానం కాదని స్పష్టం చేశారు.

సినిమా యూనిట్ వెంటనే స్పందించి అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ విషయంపై సెన్సార్ బోర్డు, సంబంధిత అధికారులు కూడా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరారు.

మరోవైపు ఈ వివాదంపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.