BREAKING
చిత్తపూరు గ్రామంలో తాగునీటి సమస్యపై గ్రామ ప్రజల ఆవేదన ప్యారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు మందు అమ్మకాలపై తాత్కాలిక నిషేధం కమ్మరి కుంట ఆక్రమణలు తొలగించాలి.. యూపీ బస్సు ప్రమాదం.. పల్నాడు యాత్రికుల కోసం జిల్లా యంత్రాంగం అప్రమత్తం ప్రపంచ తాబేలు దినోత్సవం సందర్భంగా ప్రకృతి పరిరక్షణకు పిలుపు మనవడి బర్త్‌డేను సేవా వేడుకగా మార్చిన యర్రా కుటుంబం.. మోదీ నాయకత్వంలో అభివృద్ధి పథంలో ఏలూరు జిల్లా పదో తరగతి టాపర్లను అభినందించిన నాయకులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ Brs పార్టీ నాయకులు పల్లె రామ్మూర్తి తల్లి హఠాన్మరణం చిత్తపూరు గ్రామంలో తాగునీటి సమస్యపై గ్రామ ప్రజల ఆవేదన ప్యారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు మందు అమ్మకాలపై తాత్కాలిక నిషేధం కమ్మరి కుంట ఆక్రమణలు తొలగించాలి.. యూపీ బస్సు ప్రమాదం.. పల్నాడు యాత్రికుల కోసం జిల్లా యంత్రాంగం అప్రమత్తం ప్రపంచ తాబేలు దినోత్సవం సందర్భంగా ప్రకృతి పరిరక్షణకు పిలుపు మనవడి బర్త్‌డేను సేవా వేడుకగా మార్చిన యర్రా కుటుంబం.. మోదీ నాయకత్వంలో అభివృద్ధి పథంలో ఏలూరు జిల్లా పదో తరగతి టాపర్లను అభినందించిన నాయకులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ Brs పార్టీ నాయకులు పల్లె రామ్మూర్తి తల్లి హఠాన్మరణం
www.ntodaynews.com

పదో తరగతి టాపర్లను అభినందించిన నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
23 May, 2026 - 10:05 AM
12 వీక్షణలు

“షైనింగ్ స్టార్” కార్యక్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానం

ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందిస్తూ “షైనింగ్ స్టార్” కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు ప్రత్యేక మొమెంటోలు అందజేసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులు సాధించిన ఫలితాలు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. కష్టపడి చదివి ఉన్నత ఫలితాలు సాధించిన ప్రతి విద్యార్థి భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ విజయ్ కృష్ణన్ గారికి, అలాగే విద్యార్థులు ఈ స్థాయి విజయాలు సాధించేందుకు కృషి చేసిన ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి కృషితో రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థకు కొత్త దిశ లభించిందని పేర్కొన్నారు. ఆధునిక సదుపాయాలు, నాణ్యమైన బోధన, సాంకేతికత ఆధారిత విద్యా విధానాలతో ప్రభుత్వ పాఠశాలలు అంతర్జాతీయ ప్రమాణాల వైపు దూసుకెళ్తున్నాయని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా కార్పొరేట్ స్థాయిలో ప్రతిభ కనబరుస్తుండటం ఆనందదాయకమని, భవిష్యత్తులో విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అందించే కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.