అంబేద్కర్ జ్ఞాన భవనంలో విద్యా కార్యక్రమాలపై చర్చ
అంబేద్కర్ జ్ఞాన భవనంలో విద్యా కార్యక్రమాలపై చర్చ
పిల్లలకు డిజిటల్ ట్యూషన్ల కోసం విరాళాలు
ఇటుక నెల్లూరు అంబేద్కర్ జ్ఞాన భవనంలో కమిటీ సభ్యులు, అంబేద్కర్ యువసేన సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, పిల్లలు సమావేశమై చిన్నారులకు ట్యూషన్ ఏర్పాటుపై చర్చించారు.
చిన్నపిల్లలకు డిజిటల్ విధానంలో పాఠాలు బోధిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని సమావేశంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో యువకుడు ప్రశాంత్ తన మదర్ తెరిసా కాలేజ్ స్నేహితులను సంప్రదించి సహాయం కోరగా, వారు సహృదయంతో స్పందించారు.
మోహన్, బిలీలా రోహిత్, శ్రీను, నాగేంద్ర, యోగేష్, రజిని, ప్రశాంత్ కలిసి రూ.20,000 విరాళాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు. అలాగే గ్రామానికి చెందిన కవితా వేణు రూ.5,000, జి. కృష్ణయ్య, జ్ఞానేంద్ర రూ.2,000 విరాళంగా అందజేశారు.
ఈ కార్యక్రమాన్ని గ్రామ పరివర్తన సేవా సంస్థ అధ్యక్షుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో విద్యా చైతన్యం పెంచేందుకు కృషి చేస్తున్న శ్రీనివాసులను గ్రామస్తులు అభినందించారు. అలాగే ఆయన కుమారుడు టి. ప్రశాంత్ సేవా భావాన్ని కొనియాడుతూ, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువసేన సభ్యులు వై విష్ణు, జి. శ్యామరాజ్, అరవింద్, కార్తీక్, కిరణ్, సుమంత్, మదన్, మహేష్ కుమార్, టి. శృతి తదితరులు పాల్గొన్నారు.