www.ntodaynews.com
జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక: పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం
మంచిర్యాల, ఏప్రిల్ 17
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మరికొద్ది సేపట్లో వర్షం పడనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, ఆసిఫాబాద్ మరియు మంచిర్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
అదేవిధంగా హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి చినుకులు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అకస్మాత్తుగా వాతావరణం మారే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు