జిందాల్ స్టీల్ ప్లాంట్పై క్రెడిట్ చోరీకి యత్నం: వైఎస్సార్సీపీ
రేపు స్టీల్ ప్లాంట్ ప్రాంతాన్ని సందర్శించనున్న వైఎస్సార్సీపీ బృందం
జిందాల్ స్టీల్ ప్లాంట్ ప్రాంతాన్ని గురువారం వైఎస్సార్సీపీ బృందం సందర్శించనుంది. 2023 ఫిబ్రవరి 15న అప్పటి ముఖ్యమంత్రి జిందాల్ స్టీల్స్ ప్రాజెక్టుకు భూమిపూజ చేశారని, అప్పటి ప్రభుత్వం 3,500 ఎకరాల భూమితో పాటు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించిందని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. ఆ తర్వాత జిందాల్ యాజమాన్యం ప్రాజెక్టు పనులను ప్రారంభించిందని పేర్కొన్నారు.
జూలై 3న మరోసారి జిందాల్ స్టీల్ ప్లాంట్కు భూమిపూజ చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారని, 2018లో కూడా స్టీల్ ప్లాంట్ పేరుతో శిలాఫలకం ఆవిష్కరించారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. వైఎస్ జగన్ హయాంలో తీసుకొచ్చిన జిందాల్ స్టీల్స్ ప్రాజెక్టును తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం జరుగుతోందని విమర్శించింది.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన జిందాల్ స్టీల్స్ పనులను పరిశీలించేందుకు వైఎస్సార్సీపీ బృందం గురువారం ఉదయం స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో పర్యటించనుంది. చంద్రబాబు క్రెడిట్ చోరీని ప్రజలకు వివరిస్తామని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు.