BREAKING
నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే శ్రీశైల దేవస్థానంలో పదవీ విరమణ చేసిన ఏడుగురు ఉద్యోగులకు ఘన సత్కారం వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం
www.ntodaynews.com

జిందాల్ స్టీల్ ప్లాంట్‌పై క్రెడిట్ చోరీకి యత్నం: వైఎస్సార్సీపీ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 12:53 PM
15 వీక్షణలు

రేపు స్టీల్ ప్లాంట్ ప్రాంతాన్ని సందర్శించనున్న వైఎస్సార్సీపీ బృందం

జిందాల్ స్టీల్ ప్లాంట్ ప్రాంతాన్ని గురువారం వైఎస్సార్సీపీ బృందం సందర్శించనుంది. 2023 ఫిబ్రవరి 15న అప్పటి ముఖ్యమంత్రి  జిందాల్ స్టీల్స్ ప్రాజెక్టుకు భూమిపూజ చేశారని, అప్పటి ప్రభుత్వం 3,500 ఎకరాల భూమితో పాటు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించిందని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. ఆ తర్వాత జిందాల్ యాజమాన్యం ప్రాజెక్టు పనులను ప్రారంభించిందని పేర్కొన్నారు.

జూలై 3న మరోసారి జిందాల్ స్టీల్ ప్లాంట్‌కు భూమిపూజ చేసేందుకు ముఖ్యమంత్రి  సిద్ధమవుతున్నారని, 2018లో కూడా స్టీల్ ప్లాంట్ పేరుతో శిలాఫలకం ఆవిష్కరించారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. వైఎస్ జగన్ హయాంలో తీసుకొచ్చిన జిందాల్ స్టీల్స్ ప్రాజెక్టును తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం జరుగుతోందని విమర్శించింది.

ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన జిందాల్ స్టీల్స్ పనులను పరిశీలించేందుకు వైఎస్సార్సీపీ బృందం గురువారం ఉదయం స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో పర్యటించనుంది. చంద్రబాబు క్రెడిట్ చోరీని ప్రజలకు వివరిస్తామని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు.