BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

జిందాల్ స్టీల్ ప్లాంట్‌పై క్రెడిట్ చోరీకి యత్నం: వైఎస్సార్సీపీ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 12:53 PM
70 వీక్షణలు

రేపు స్టీల్ ప్లాంట్ ప్రాంతాన్ని సందర్శించనున్న వైఎస్సార్సీపీ బృందం

జిందాల్ స్టీల్ ప్లాంట్ ప్రాంతాన్ని గురువారం వైఎస్సార్సీపీ బృందం సందర్శించనుంది. 2023 ఫిబ్రవరి 15న అప్పటి ముఖ్యమంత్రి  జిందాల్ స్టీల్స్ ప్రాజెక్టుకు భూమిపూజ చేశారని, అప్పటి ప్రభుత్వం 3,500 ఎకరాల భూమితో పాటు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించిందని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. ఆ తర్వాత జిందాల్ యాజమాన్యం ప్రాజెక్టు పనులను ప్రారంభించిందని పేర్కొన్నారు.

జూలై 3న మరోసారి జిందాల్ స్టీల్ ప్లాంట్‌కు భూమిపూజ చేసేందుకు ముఖ్యమంత్రి  సిద్ధమవుతున్నారని, 2018లో కూడా స్టీల్ ప్లాంట్ పేరుతో శిలాఫలకం ఆవిష్కరించారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. వైఎస్ జగన్ హయాంలో తీసుకొచ్చిన జిందాల్ స్టీల్స్ ప్రాజెక్టును తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం జరుగుతోందని విమర్శించింది.

ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన జిందాల్ స్టీల్స్ పనులను పరిశీలించేందుకు వైఎస్సార్సీపీ బృందం గురువారం ఉదయం స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో పర్యటించనుంది. చంద్రబాబు క్రెడిట్ చోరీని ప్రజలకు వివరిస్తామని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు.