BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

జిందాల్ స్టీల్ ప్లాంట్‌పై క్రెడిట్ చోరీకి యత్నం: వైఎస్సార్సీపీ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 12:53 PM
33 వీక్షణలు

రేపు స్టీల్ ప్లాంట్ ప్రాంతాన్ని సందర్శించనున్న వైఎస్సార్సీపీ బృందం

జిందాల్ స్టీల్ ప్లాంట్ ప్రాంతాన్ని గురువారం వైఎస్సార్సీపీ బృందం సందర్శించనుంది. 2023 ఫిబ్రవరి 15న అప్పటి ముఖ్యమంత్రి  జిందాల్ స్టీల్స్ ప్రాజెక్టుకు భూమిపూజ చేశారని, అప్పటి ప్రభుత్వం 3,500 ఎకరాల భూమితో పాటు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించిందని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. ఆ తర్వాత జిందాల్ యాజమాన్యం ప్రాజెక్టు పనులను ప్రారంభించిందని పేర్కొన్నారు.

జూలై 3న మరోసారి జిందాల్ స్టీల్ ప్లాంట్‌కు భూమిపూజ చేసేందుకు ముఖ్యమంత్రి  సిద్ధమవుతున్నారని, 2018లో కూడా స్టీల్ ప్లాంట్ పేరుతో శిలాఫలకం ఆవిష్కరించారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. వైఎస్ జగన్ హయాంలో తీసుకొచ్చిన జిందాల్ స్టీల్స్ ప్రాజెక్టును తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం జరుగుతోందని విమర్శించింది.

ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన జిందాల్ స్టీల్స్ పనులను పరిశీలించేందుకు వైఎస్సార్సీపీ బృందం గురువారం ఉదయం స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో పర్యటించనుంది. చంద్రబాబు క్రెడిట్ చోరీని ప్రజలకు వివరిస్తామని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు.