www.ntodaynews.com
జంగారెడ్డిగూడెంలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
జంగారెడ్డిగూడెంలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని శాంసంగ్ అపార్ట్మెంట్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి రూ.44,220 నగదు, 104 పేక ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.