జనార్దనవరంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జనార్దనవరంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్దనవరం గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పాఠశాల, సచివాలయం వద్ద నిర్వహించిన జెండా వందనం కార్యక్రమంలో చాట్రాయి మండల టీడీపీ మహిళా అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ, గ్రామ టీడీపీ అధ్యక్షులు మాదాసు చిన్నపుల్లయ్య పాల్గొని జాతీయ పతాకానికి వందనం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. యువత దేశభక్తి, క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు.
గ్రామంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.