జనసేన ఎమ్మెల్యే కొణతాల మేనల్లుడితో పాటు.. మరో ఐదుగురిపై ఎఫ్ఎఆర్!
అనకాపల్లిలో రాత్రికి రాత్రే స్థలాన్ని ఆక్రమించేసి బోర్డు పెట్టేసిన వారిపై కేసు నమోదు
జనసేన ఎమ్మెల్యే కొణతాల మేనల్లుడితో పాటు.. మరో ఐదుగురిపై ఎఫ్ఎఆర్!
అనకాపల్లిలో రాత్రికి రాత్రే స్థలాన్ని ఆక్రమించేసి బోర్డు పెట్టేసిన వారిపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మేనల్లుడు కూడా ఈ కేసులో ఉండడం విశేషం.
గత ఫిబ్రవరి 18నే గోడ కూల్చేసినప్పటికీ పోలీసులు మాత్రం ఆలస్యంగా స్పందించారు. ఆరుగురిపై అనకాపల్లి పట్టణ పోలీసులు ఈ నెల 9న ఎన్ఐఆర్ నమోదు చేశారు.
కాండ్రేగుల బాల వెంకట పరమేశ్వరరావు ఇచ్చిన ఫిర్చాదు మేరకు అనకాపల్లి టౌన్ పోలీసులు క్రైం నంబర్ 89/2026పేరిట ఈ నెల 9న కేసు నమోదు చేశారు.
విల్లూరి గణేష్, దాడి నాని, ఆడారి శంకర్రావు, శరగడం రమేష్, కొణతాల బాల, బుద్ధ మురళీ తాతారావు అనే వ్యక్తులపై బీఎన్ ఎస్ ప్రకారం మొత్తం ఆరుగురు నిందితులపై 324 (5), 351 (3), రెడ్ విత్ 3 (5) చట్టాల్ని విధించారు.