BREAKING
సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సైదాబాద్‌లో 98 రేషన్ బియ్యం బస్తాలు పట్టివేత తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు
www.ntodaynews.com

జనవిజ్ఞాన వేదిక వైద్య శిబిరానికి విశేష స్పందన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Aug, 2026 - 04:59 PM
75 వీక్షణలు

జనవిజ్ఞాన వేదిక వైద్య శిబిరానికి విశేష స్పందన

తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నాగార్జున పాఠశాలలో నిర్వహిస్తున్న బీపీ, షుగర్, ఫిట్స్ రెగ్యులర్ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గత 13 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ వైద్య శిబిరానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి 950 మంది హాజరయ్యారు.

శిబిరానికి వచ్చిన వారికి రెండు నెలలకు సరిపడ మందులను కేవలం రూ.200కే అందించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ బీపీ, షుగర్ వ్యాధులు కేవలం మందులతోనే నియంత్రణలోకి రావని, సరైన ఆహార నియమాలు పాటిస్తూ ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.

వరి, గోధుమ వంటి ఆహార పదార్థాలను ఒక పూటకే పరిమితం చేసి రాగులు, జొన్నలు, సజ్జలు వంటి తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు.

ఈ వైద్య శిబిరంలో వైద్యులు డాక్టర్ రవీంద్ర, డాక్టర్ చి. రాహుల్, డాక్టర్ శివాజీతో పాటు మదర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ విద్యార్థులు పాల్గొన్నారు. జనవిజ్ఞాన వేదిక నాయకులు యం. హరికృష్ణ, కె. పాపారావు, కె. లక్ష్మణరావు, రాజశేఖరరెడ్డి, ఆంజనేయులు, ప్రతాపరెడ్డి, యం. నాగేంద్ర ప్రసాద్, చి. శ్రీను, సురేష్ తదితరులు సేవలు అందించారు.