www.ntodaynews.com
జోగిండ్ల సమీపంలో ఆవులకు బొబ్బల వ్యాధి వ్యాక్సినేషన్...
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
జోగిండ్ల సమీపంలో ఆవులకు బొబ్బల వ్యాధి వ్యాక్సినేషన్...
అన్నమయ్య జిల్లా.
పుంగనూరు.
పుంగనూరు మండలం కొత్తపేటలోని జోగిండ్ల సమీపంలో ఈరోజు ఆవులకు బొబ్బల వ్యాధి నివారణ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు.
పశువులకు బొబ్బల వ్యాధి సోకకుండా ముందస్తు జాగ్రత్తగా పశువైద్య సిబ్బంది ఆవులకు వ్యాక్సిన్లు వేశారు. ఈ కార్యక్రమంలో పశువుల యజమానులు పాల్గొని తమ పశువులకు వ్యాక్సిన్ వేయించారు.
పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సినేషన్ను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని సిబ్బంది సూచించారు.