BREAKING
మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి
www.ntodaynews.com

జోసెఫ్ విజయ్ అను నేను...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
10 May, 2026 - 12:53 PM
67 వీక్షణలు

Joseph Vijay తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పుంగనూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అయూబ్ భాష ఆధ్వర్యంలో, వామపక్ష పార్టీల నాయకులతో కలిసి స్థానిక పాత బస్ స్టాండ్ వద్ద కేక్ కట్ చేసి, బాణాసంచాలు పేల్చి ఘనంగా సంబరాలు నిర్వహిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్నో ఒడిదడుకులను ఎదుర్కొని, దశాబ్దాలుగా కొనసాగుతున్న ద్రవిడ రాజకీయ కోటలను ఛేదిస్తూ భారత రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించిన పోరాట యోధుడు జోసెఫ్ విజయ్ గారికి అభినందనలు తెలిపారు. సినీ రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా ప్రజల హృదయాలను గెలుచుకుని చరిత్ర సృష్టించిన నాయకుడిగా ఆయన నిలిచారని కొనియాడారు.

డబ్బు, అధికారం కాకుండా ప్రజల ప్రేమ, విశ్వాసంతో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎదిగిన మీరు యువతకు, సాధారణ ప్రజలకు ఆశాకిరణంగా మారారని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేసి, రాబోయే తరాలకు బంగారు భవిష్యత్తు అందించాలని ఆకాంక్షించారు.

“చరిత్రలో ఒక్కడు… ప్రజల మనసుల్లో నిజమైన హీరో”గా నిలిచిన విజయ్ గారు రాజకీయాల్లో కూడా కొత్త ప్రమాణాలు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో Communist Party of India పార్టీ సహాయ కార్యదర్శి మున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్తాఫ్, ముబారక్, ఫయాజ్, అజ్మత్, షాహిద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సజ్జాద్, CPI నాయకులు తదితరులు పాల్గొన్నారు.