జర్నలిస్టులకు ఆరోగ్య బీమా అమలు చేయాలి
జర్నలిస్టులకు ఆరోగ్య బీమా అమలు చేయాలి: ఏపీయూడబ్ల్యూజే ఏలూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ అజాద్
చింతలపూడి:
జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) గత 70 ఏళ్లుగా నిరంతరం పోరాడుతోందని ఆ సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎస్కే అజాద్ తెలిపారు.
ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం చింతలపూడి యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర, జిల్లా నాయకత్వం పిలుపు మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల సమస్యలు, డిమాండ్లపై చింతలపూడి డిప్యూటీ తహసిల్దార్ షేక్ షకీలాకు వినతిపత్రం అందజేశారు.
అనంతరం పత్రికా రంగంలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న చింతలపూడి సీనియర్ పాత్రికేయుడు మాదాసు పుల్లారావును ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా అజాద్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌకర్యాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.
అలాగే విధి నిర్వహణలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే సీనియర్ సభ్యులు కె.ఎస్.ఎస్. వీరయ్య, అమీర్ పాషా, ఖలీల్, జి. నాగేశ్వరరావు, కె. కృపావరం, రజినీ, సంజయ్, బాలు, నరేష్, నాగేంద్ర, సత్యనారాయణ, ప్రసాద్, నదీమ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.