www.ntodaynews.com
కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
తెలంగాణ
/
మంచిర్యాల
/
బెల్లంపల్లి
కాగజ్నగర్: రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం - ఇద్దరు కార్మికులకు గాయాలు
కాగజ్నగర్లోని పెద్దవాగు వద్ద జరుగుతున్న రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల్లో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే లైన్ పనుల్లో భాగంగా బాక్స్ బ్రిడ్జి నిర్మిస్తుండగా, ఒక్కసారిగా ప్రమాదం జరిగి ఇద్దరు కార్మికులు అందులో ఇరుక్కుపోయారు.
ప్రమాదాన్ని గమనించిన తోటి సిబ్బంది వెంటనే స్పందించి, ఒక కార్మికుడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, మరో కార్మికుడు బ్రిడ్జి కింద ఇరుక్కుపోయి తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే మరియు స్థానిక అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి