కార్యకర్తలకు బైకులు అందించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
నాయకుడి వద్ద కారు ఉంటే.. కార్యకర్త వద్ద బైక్ ఉండాలి
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం: పార్టీ కోసం క్షేత్రస్థాయిలో నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తలకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అండగా నిలిచారు. గంపలగూడెం మండలానికి చెందిన ఐదుగురు క్రియాశీలక కార్యకర్తలకు తన సొంత నిధులతో ద్విచక్ర వాహనాలను అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నాయకుడి వద్ద కారు ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం జెండా మోస్తూ పనిచేసే కార్యకర్తల వద్ద కనీసం బైక్ అయినా ఉండాలన్నదే తన ఉద్దేశమన్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను గుర్తించి ప్రోత్సహిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే నుంచి లభించిన ఈ ప్రోత్సాహంపై కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యకర్తల అవసరాలను గుర్తించి వ్యక్తిగతంగా సహాయం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.