కాట్రపల్లి సీతారామాంజనేయ స్వామి దేవాలయ నూతన కమిటీ ఏర్పాటు
కాట్రపల్లి సీతారామాంజనేయ స్వామి దేవాలయ నూతన కమిటీ ఏర్పాటు
చైర్మన్గా చిలుకమారి శ్రీనివాస్ ఎంపిక
కాట్రపల్లి గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో శుక్రవారం నూతన ఆలయ కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా గౌరవాధ్యక్షుడిగా పెరుమాండ్ల హైమా బిక్షపతి, దేవాలయ కమిటీ చైర్మన్గా చిలుకమారి శ్రీనివాస్ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షుడిగా ముత్తోజు సాంబశివాచారి, కోశాధికారిగా బాణాల కుమార్ నియమితులయ్యారు.
కమిటీ సభ్యులుగా వంగ రాములు, సంగాల రాజ్, రావుల రాజేష్, తోగరు శివకృష్ణ, అల్లి జగదీష్, తాడూరి శ్రీనివాస్, ఎదులపురం రాజు, తోగరు మోహన్, నిమ్మల కుమారస్వామి, వేల్పుల అశోక్, బాణాల పెద్దులు మరియు గ్రామ పెద్దలు ఎంపికయ్యారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్లి సత్య రాజం అయ్యగారు, ప్రవీణ్ శర్మ దేవాలయంలో పంచాంగం చెప్పి ఈ సంవత్సరంలో పాడి పంటలు, పశువులు అభివృద్ధి చెందుతాయని, వర్షాలు ఆలస్యంగా వచ్చినా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని తెలిపారు. రాశుల ఆధారంగా ఫలితాలను కూడా వివరించారు.
అయ్యగారిని సర్పంచ్ హైమా బిక్షపతి ఘనంగా సన్మానించారు. అలాగే నూతనంగా నియమితులైన చైర్మన్ చిలుకమారి శ్రీనివాస్ను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో గంగదారి బిక్షపతి, ఉపసర్పంచ్ నిమ్మల రాజకుమార్, నిమ్మల కుమారస్వామి, వార్డ్ మెంబర్ కొమటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.