కంటయపాలెం జిల్లా పరిషత్ హై హైస్కూల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులకు సన్మానం
కంటయపాలెం జిల్లా పరిషత్ హై హైస్కూల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులకు సన్మానం
కంటాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాల కార్యక్రమాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీ .ప్రభాకర్ సార్ మరియు ఉపాధ్యాయ బృందం, కంటాయపాలెం గ్రామ సర్పంచ్ రాగి సంగీత జగదీశ్వరాచార్యులు, బొల్లి కొండ సుధాకర్ గార్లు పాల్గొనడం జరిగింది. సభను ఉద్దేశించి గ్రామ సర్పంచ్ గారు ఈ సంవత్సరం పదవ తరగతి 100కు100 శాతం ఉత్తీర్ణత శాతాన్ని తీసుకువచ్చిన ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలిపి ,
500 మార్కులకు ఎక్కువ సాధించిన విద్యార్థులు టి. కార్తీక్ 531/600, డి. క్రాంతి 527/600, జి. నీరజ.513/600, ఎండి.రషీద్ 513/600, ఎం.పౌర్ణమి 506 /600 ,
వీరికి ఆర్థిక సహాయం అందజేసి విద్యార్థులను ఉన్నత విద్యను అభ్యసించడానికి కృషి చేయాలని విద్యార్థులకు తల్లిదండ్రులకు సూచించడం జరిగినది.