BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

కొల్లేరులో అక్రమ చెరువుల ముసుగులో కూలీల కన్నీరు..!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jul, 2026 - 07:26 AM
31 వీక్షణలు

కొల్లేరులో అక్రమ చెరువుల ముసుగులో కూలీల కన్నీరు..!

అక్రమ చెరువులు.. అడ్డగోలు వ్యవహారాలు..!

కొల్లేరు ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న చేపల చెరువుల వ్యవహారం మరోసారి వివాదానికి దారితీసింది. పని చేయించుకుని కూలీలకు కూలీ చెల్లించకుండా తప్పించుకుంటున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

మూడు రోజులుగా కూలీ డబ్బులు ఇవ్వాలని కోరుతూ బాధిత కూలీలు సంబంధిత యజమానుల గేటు ముందు పడిగాపులు కాస్తున్నా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు. కూలీ అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని, “ఎక్కడైనా వెళ్లి చెప్పుకోండి” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని కూలీలు ఆరోపిస్తున్నారు.

ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ చెరువుల వ్యవహారంపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కూడా మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

పని చేయించుకుని చేతులు దులుపుకున్న యజమానులపై వెంటనే చర్యలు తీసుకుని తమకు రావాల్సిన కూలీ డబ్బులు ఇప్పించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇదిలా ఉండగా, కొల్లేరు అక్రమ చెరువుల వెనుక జరుగుతున్న అసలు వ్యవహారమేంటనే దానిపై కూడా స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ వివాదం మరోసారి పెద్దల వద్దకు చేరినట్లు సమాచారం. కూలీలకు న్యాయం జరిగేలా అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.