BREAKING
thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి
Date of Publish : 17 September 2026, 07:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కోడూరులో పైడిమర్రి వెంకట సుబ్బారావుకు ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Sep, 2026 - 07:05 PM
18 వీక్షణలు

ఏ.కొండూరు: భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలం కోడూరు మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో కార్యక్రమం నిర్వహించారు. ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు చిత్రపటానికి విద్యార్థులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పైడిమర్రి వెంకట సుబ్బారావు జీవిత చరిత్ర రచయిత యం. రాం ప్రదీప్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి, సోదరభావం, జాతీయ సమైక్యతా భావాలను పెంపొందించడంలో భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో దేశం పట్ల గౌరవం, బాధ్యతా భావం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది బి. నాగేంద్ర రావు, వి. తేజస్విని, వి. జయశ్రీ, టీ. సుప్రియతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.