పోలవరం: రజకుల బజారులో ఘనంగా వినాయక విగ్రహ ప్రతిష్ఠ
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలోని రజకుల బజారులో రాయల రజకుల యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వినాయక చవితిని పురస్కరించుకుని కొన్నే మోహన్రావు, సరస్వతి దంపతుల కుమారుడు కొన్నే రమేష్ (లేటు) జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వినాయక విగ్రహాన్ని బహుకరించారు. గురుస్వామి కుంటముక్కల మల్లికార్జునరావు చేతుల మీదుగా ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాయల రజకుల యువజన సంఘం సభ్యులు, నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.