కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లిన టీడీపీ నేతలు
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లిన టీడీపీ నేతలు
తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం పెద్దవరం గ్రామంలోని 72వ పోలింగ్ బూత్ పరిధిలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికీ కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు దుబ్బాకు వెంకటేశ్వరావు, క్లస్టర్ ఇన్చార్జి తేలాప్రోలు మోహనరావు, ఆంధ్రప్రదేశ్ మాదిగ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య, బూత్ కన్వీనర్ నన్నపనేని సాయి, పీఏసీఎస్ చైర్మన్ చేకూరి పట్టాభి, దొడ్డా మాధవరావు, మేకల వేణు, కో-కన్వీనర్ చిలక వెంకన్నతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.