www.ntodaynews.com
కరీంనగర్ చౌరస్తాలో సిరికొండ వాసి మృతి
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
కరీంనగర్ చౌరస్తాలో సిరికొండ వాసి మృతి
లక్సెట్టిపేట మండలంలోని కరీంనగర్ చౌరస్తాలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. వెల్గటూర్ మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన చుక్కారెడ్డి అనే వ్యక్తి గత కొంతకాలంగా మతిస్థిమితం లేక తిరుగుతూ కరీంనగర్ చౌరస్తాకు చేరుకున్నారు.
సోమవారం ఆయన చౌరస్తాలో నిర్జీవంగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం చుక్కారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు