www.ntodaynews.com
చింతలపూడిలో ఎన్డీఏ రెండేళ్ల విజయోత్సవ బైక్ ర్యాలీ - జనసేన నాయకుల ఘన ప్రదర్శన
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చింతలపూడి మండల రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు చింతలపూడి పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మేక ఈశ్వరయ్య, AMC చైర్మన్ దుర్గపార్వతి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చిదరాల మధుబాబు, పోల్నాటి బాబ్జి తదితర నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.