BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

లైన్‌మెన్ నిర్లక్ష్యానికి యువకుడికి తీవ్ర గాయాలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
15 Jun, 2026 - 03:49 PM
326 వీక్షణలు

న్యాయం చేయాలంటూ చిట్యాల సబ్ స్టేషన్ ఎదుట ధర్నా

కరెంట్ పనుల నిమిత్తం తీసుకెళ్లిన లైన్‌మెన్ నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడు విద్యుత్ ఘాతానికి గురై తీవ్రంగా గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగి 18  రోజులు గడుస్తున్నా అటు లైన్‌మెన్ గానీ, ఇటు విద్యుత్ శాఖ అధికారులు గానీ పట్టించుకోకపోవడంతో బాధితుడి కుటుంబం రోడ్డున పడింది. సోమవారం రోజు చిట్యాల లోని సబ్ స్టేషన్ లో పట్టిమర్తి గ్రామస్తులు విద్యుత్ సరఫరా నిలిపివేసి  ధర్నాకు దిగారు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బావితురాలైన  తల్లి తెలిపిన వివరాల ప్రకారం. ​నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి  గ్రామానికి చెందిన తన కొడుకు  మనోజ్  మే 30, 2026 నాడు స్థానిక సబ్‌స్టేషన్ పరిధిలో పని చేసే లైన్‌మెన్  వెంకటేష్  కరెంట్ పని కోసం పిలుచుకెళ్లాడు. ​పని చేసే సమయంలో ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా, కరెంట్ లైన్ 11 కె.వి  పోల్‌పైకి మనోజ్ ను ఎక్కించారు. లైన్‌మెన్ నిర్లక్ష్యం కారణంగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో (ఇండక్షన్ రావడం వల్ల) మనోజ్ కు తీవ్రంగా కరెంట్ షాక్ కొట్టి పైనుంచి కిందపడిపోయాడు అని తెలిపారు  ​ఈ ప్రమాదంలో మనోజ్ కు రెండు కాళ్లు, చేతులు, వీపు భాగం తీవ్రంగా గాయాలు తాకి విరిగిపోయాయి. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు అన్నారు. భర్త లేని ఆ కుటుంబానికి కొడుకే (మనోజ్) ఆధారం కాగా, ఇప్పుడు కొడుకు కూడా వికలాంగుడిగా మారడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరవుతోంది. ​ప్రమాదం జరిగిన సమయంలో లైన్‌మెన్ వెంకటేష్ బాధితుడి కుటుంబంతో మాట్లాడి, తానే చూసుకుంటానని నమ్మబలికాడు. కానీ ఆసుపత్రి లో 17 రోజులుగా చికిత్స పొందుతున్నప్పటికీ లైన్‌మెన్ గానీ, ఇటు విద్యుత్ శాఖ డిపార్ట్‌మెంట్ వారు గానీ కనీసం పట్టించుకోలేదు సరే కదా, కనీస సహాయం కూడా చేయలేదని బాధిత కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.
​దీనిపై బాధితుడి తల్లి జాల బద్రమ్మ తమకు జరిగిన అన్యాయాన్ని   ప్రమాదానికి కారణమైన లైన్‌మెన్‌పై చర్యలు తీసుకుని, విద్యుత్ శాఖ నుండి తమ కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ఆమె వేడుకుంటున్నారు.