www.ntodaynews.com
కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్
తెలంగాణ
/
మంచిర్యాల
/
లక్సెట్టిపేట
కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్: నాణ్యమైన విద్య, భోజనం అందించాలని ఆదేశం
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం లక్సెట్టిపేట పట్టణంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, వంటగది మరియు ఇతర వసతులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, విద్యార్థుల విద్యా ప్రమాణాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని, పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని పాఠశాల నిర్వాహకులను మరియు ఉపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు