కుప్పం దేశానికే మోడల్గా నిలుస్తుంది: చంద్రబాబు
కుప్పం | NTODAY NEWS
రానున్న రోజుల్లో కుప్పం నియోజకవర్గం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.
మూడు రోజుల కుప్పం పర్యటన విజయవంతంగా, ఉత్సాహంగా సాగిందని పేర్కొన్న సీఎం, కంగుంది భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపినట్లు తెలిపారు.
అలాగే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో 30 అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు కుప్పం ప్రాంత ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపు తీసుకురానున్నాయని చెప్పారు.
'స్వర్ణ కుప్పం' లక్ష్యాన్ని సాకారం చేసేందుకు సమగ్ర విజన్తో కార్యాచరణ రూపొందిస్తున్నామని సీఎం తెలిపారు. మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో సమగ్ర అభివృద్ధి ద్వారా కుప్పాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.