గెస్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: నారా భువనేశ్వరి
గెస్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: నారా భువనేశ్వరి
కుప్పం: కుప్పం నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లు గురువారం నారా భువనేశ్వరిని కలిసి తమ సమస్యలను వినిపించారు.
ఈ సందర్భంగా గెస్ట్ లెక్చరర్లు మాట్లాడుతూ, రాష్ట్రంలోని 472 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత 12 సంవత్సరాలుగా 1,617 మంది గెస్ట్ లెక్చరర్లుగా సేవలందిస్తున్నామని తెలిపారు. తమ సేవలను గుర్తించి కాంట్రాక్ట్ విధానంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వారి వినతిపై స్పందించిన నారా భువనేశ్వరి, గెస్ట్ లెక్చరర్ల సమస్యలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రజనీకాంత్, కుమార్, నరసింహులు, వనజ, చందన, మోహన్ తదితరులు పాల్గొన్నారు.రజనీకాంత్, కుమార్ ,నరసింహులు ,వనజ ,చందన ,మోహనతదితరులు పాల్గొన్నారు,