కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య కేసు నమోదు చేసిన ఎస్సై హృషికేశవరెడ్డి
రామసముద్రం :
కుటుంబ కలహాలతో మహిళా ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం రామసముద్రం మండ లంలోని పెద్దకురప్పల్లె గ్రామ పంచాయతీ బసవన్న కట్ట గ్రామంలో చోటు చేసుకుంది, ఎస్సె హృషికేశవ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం గంగవరం కు చెందిన రమ్య ను బసవన్న కట్టకు చెందిన విజయ్ కుమారుడు తేజ కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఒక కుమార్తె ఉంది.గత కొంత కాలంగా భార్యాభర్త ల మధ్య మన స్పర్ధలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రమ్య మనస్తాపం చెంది ఆదివారం ఎలుకలు మందు తాగింది . కుటుంబ సభ్యులు గమనించి రమ్యను హుటాహుటిన పుంగనూరు ఆసుపత్రికి తరలించగా పుంగనూరు వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం కోసం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి రెపర్ చేశారు. చికిత్స పొందుతూ రమ్య మరణించింది. రమ్య తండ్రి శివయ్య పిర్యాదు పై ఎస్సై హృషి కేశవ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.