ఖమ్మంలో పేద కుటుంబానికి ఇల్లు – సీఎం ఏ. రేవంత్ రెడ్డి తక్షణ సహాయం
ఖమ్మం: ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలవడంలో ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామానికి చెందిన ఒక నిరుపేద కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలపై వెలువడిన కథనానికి ఆయన తక్షణమే స్పందించారు.
కథనం వెనుక ఉన్న బాధ:
గోపాలపేటకు చెందిన రమేష్–సులోచన దంపతుల బిడ్డ ఎదుగుదల సమస్యలతో బాధపడుతోంది. ఒకవైపు బిడ్డ అనారోగ్యం, మరోవైపు సరైన నివాసం లేక ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం మీడియా ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది.
సీఎం ఆదేశాలతో తక్షణ సహాయం:
ఈ పరిస్థితిపై చలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఆ కుటుంబానికి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలు వెలువడిన కొన్ని గంటల్లోనే జిల్లా కలెక్టర్ స్పందించి, రెవెన్యూ సిబ్బందిని ఆ గ్రామానికి పంపించారు. అధికారుల బృందం రమేష్–సులోచన దంపతులను కలిసి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి ఇంటి మంజూరు పత్రాలను అందజేశారు.
తమ గోడును ఆలకించి, తక్షణమే గూడు కల్పించిన ముఖ్యమంత్రికి ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఘటన ద్వారా ప్రభుత్వం సామాన్యుల పక్షాన ఉందనే నమ్మకాన్ని ముఖ్యమంత్రి మరోసారి నిరూపించారు.