BREAKING
ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి ​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లకు ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం బేడా బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి చనుబండలో ఇంటింటికీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ​మంచిర్యాల నూతన ఏసీగా రాజు బాధ్యతల స్వీకరణ సూరంపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా పెన్షన్‌ల పంపిణీ డయేరియా నివారణకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు మోసపూరిత మద్దతు ధరలపై రైతు సంఘం ఆందోళన పాడి రైతుల అభివృద్ధే లక్ష్యం కీసర పోలీస్ స్టేషన్‌కు సీపీ సుమతి ​మంచిర్యాల డీఈఓ యాదయ్య బదిలీ
www.ntodaynews.com

ఖమ్మంలో పేద కుటుంబానికి ఇల్లు – సీఎం ఏ. రేవంత్ రెడ్డి తక్షణ సహాయం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
23 Mar, 2026 - 04:39 PM
89 వీక్షణలు

ఖమ్మం: ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలవడంలో ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి  మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామానికి చెందిన ఒక నిరుపేద కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలపై వెలువడిన కథనానికి ఆయన తక్షణమే స్పందించారు.

​కథనం వెనుక ఉన్న బాధ:

గోపాలపేటకు చెందిన రమేష్–సులోచన దంపతుల బిడ్డ ఎదుగుదల సమస్యలతో బాధపడుతోంది. ఒకవైపు బిడ్డ అనారోగ్యం, మరోవైపు సరైన నివాసం లేక ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం మీడియా ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది.

​సీఎం ఆదేశాలతో తక్షణ సహాయం:

ఈ పరిస్థితిపై చలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఆ కుటుంబానికి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలు వెలువడిన కొన్ని గంటల్లోనే జిల్లా కలెక్టర్ స్పందించి, రెవెన్యూ సిబ్బందిని ఆ గ్రామానికి పంపించారు. అధికారుల బృందం రమేష్–సులోచన దంపతులను కలిసి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి ఇంటి మంజూరు పత్రాలను అందజేశారు.

​తమ గోడును ఆలకించి, తక్షణమే గూడు కల్పించిన ముఖ్యమంత్రికి ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఘటన ద్వారా ప్రభుత్వం సామాన్యుల పక్షాన ఉందనే నమ్మకాన్ని ముఖ్యమంత్రి మరోసారి నిరూపించారు.