BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 23 March 2026, 04:39 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

ఖమ్మంలో పేద కుటుంబానికి ఇల్లు – సీఎం ఏ. రేవంత్ రెడ్డి తక్షణ సహాయం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
23 Mar, 2026 - 04:39 PM
159 వీక్షణలు

ఖమ్మం: ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలవడంలో ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి  మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామానికి చెందిన ఒక నిరుపేద కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలపై వెలువడిన కథనానికి ఆయన తక్షణమే స్పందించారు.

​కథనం వెనుక ఉన్న బాధ:

గోపాలపేటకు చెందిన రమేష్–సులోచన దంపతుల బిడ్డ ఎదుగుదల సమస్యలతో బాధపడుతోంది. ఒకవైపు బిడ్డ అనారోగ్యం, మరోవైపు సరైన నివాసం లేక ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం మీడియా ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది.

​సీఎం ఆదేశాలతో తక్షణ సహాయం:

ఈ పరిస్థితిపై చలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఆ కుటుంబానికి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలు వెలువడిన కొన్ని గంటల్లోనే జిల్లా కలెక్టర్ స్పందించి, రెవెన్యూ సిబ్బందిని ఆ గ్రామానికి పంపించారు. అధికారుల బృందం రమేష్–సులోచన దంపతులను కలిసి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి ఇంటి మంజూరు పత్రాలను అందజేశారు.

​తమ గోడును ఆలకించి, తక్షణమే గూడు కల్పించిన ముఖ్యమంత్రికి ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఘటన ద్వారా ప్రభుత్వం సామాన్యుల పక్షాన ఉందనే నమ్మకాన్ని ముఖ్యమంత్రి మరోసారి నిరూపించారు.