BREAKING
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి.. క్వింటాల్ పొగాకు రూ.40 వేలకు కొనాలి – అఖిలభారత కిసాన్ మహాసభ డిమాండ్ పాడి రైతు కుటుంబాల్లో ఆనందం నింపుతున్న విజయ డైరీ ‘కళ్యాణమస్తు’ గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో ఆపరేషన్ వజ్రపుహార్ కార్యక్రమం నిర్వహణ.... సబ్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి చాట్రాయి మండలంలో పెను ప్రమాదం తప్పింది.. రోడ్డు దుస్థితితో ట్రాక్టర్ బోల్తా! ధాన్యపు నిల్వల ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్ కుమార్ దీపక్ ​సింగరేణి విద్యాసంస్థల ఉద్యోగాల భర్తీలో అక్రమాలు: పీడీఎస్‌యూ నిరసన ఏలూరు జిల్లాలో ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఖతార్‌లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలు – మినీ మహానాడు విజయవంతం ఉద్యోగం పేరుతో యువతిపై వేధింపుల ఆరోపణలు.. లెక్చరర్‌ను నిలదీసిన భార్య అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి.. క్వింటాల్ పొగాకు రూ.40 వేలకు కొనాలి – అఖిలభారత కిసాన్ మహాసభ డిమాండ్ పాడి రైతు కుటుంబాల్లో ఆనందం నింపుతున్న విజయ డైరీ ‘కళ్యాణమస్తు’ గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో ఆపరేషన్ వజ్రపుహార్ కార్యక్రమం నిర్వహణ.... సబ్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి చాట్రాయి మండలంలో పెను ప్రమాదం తప్పింది.. రోడ్డు దుస్థితితో ట్రాక్టర్ బోల్తా! ధాన్యపు నిల్వల ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్ కుమార్ దీపక్ ​సింగరేణి విద్యాసంస్థల ఉద్యోగాల భర్తీలో అక్రమాలు: పీడీఎస్‌యూ నిరసన ఏలూరు జిల్లాలో ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఖతార్‌లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి వేడుకలు – మినీ మహానాడు విజయవంతం ఉద్యోగం పేరుతో యువతిపై వేధింపుల ఆరోపణలు.. లెక్చరర్‌ను నిలదీసిన భార్య
www.ntodaynews.com

క్వింటాల్ పొగాకు రూ.40 వేలకు కొనాలి – అఖిలభారత కిసాన్ మహాసభ డిమాండ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 May, 2026 - 09:11 PM
16 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో జరిగిన పత్రికా సమావేశంలో అఖిలభారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన పొగాకును టుబాకో బోర్డు ద్వారా క్వింటాల్‌కు రూ.40 వేల చొప్పున కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్డీఏ పాలనలో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, పంటలకు గిట్టుబాటు ధరలు లేక దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని హరినాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, తర్వాత మాట తప్పిందని విమర్శించారు.

అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు భారత రైతాంగానికి నష్టం చేస్తున్నాయని, విదేశీ పత్తిపై దిగుమతి సుంకాలు తగ్గించాలని కోరడం రైతాంగ వ్యతిరేక చర్య కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పత్తి ఎగుమతులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూనే, పొగాకు రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు.

రాష్ట్రంలో జరిగే మహానాడులో అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు ప్రకటించాలని, ధరల స్థిరీకరణ నిధిని రూ.600 కోట్లతో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతాంగ నిరసనలు తప్పవని హరినాథ్ హెచ్చరించారు.