BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

క్వింటాల్ పొగాకు రూ.40 వేలకు కొనాలి – అఖిలభారత కిసాన్ మహాసభ డిమాండ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 May, 2026 - 09:11 PM
219 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో జరిగిన పత్రికా సమావేశంలో అఖిలభారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన పొగాకును టుబాకో బోర్డు ద్వారా క్వింటాల్‌కు రూ.40 వేల చొప్పున కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్డీఏ పాలనలో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, పంటలకు గిట్టుబాటు ధరలు లేక దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని హరినాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, తర్వాత మాట తప్పిందని విమర్శించారు.

అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు భారత రైతాంగానికి నష్టం చేస్తున్నాయని, విదేశీ పత్తిపై దిగుమతి సుంకాలు తగ్గించాలని కోరడం రైతాంగ వ్యతిరేక చర్య కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పత్తి ఎగుమతులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూనే, పొగాకు రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు.

రాష్ట్రంలో జరిగే మహానాడులో అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు ప్రకటించాలని, ధరల స్థిరీకరణ నిధిని రూ.600 కోట్లతో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతాంగ నిరసనలు తప్పవని హరినాథ్ హెచ్చరించారు.