www.ntodaynews.com
లింగపాలెం మండలంలో రేషన్ షాపుల తనిఖీ
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
లింగపాలెం మండలంలో రేషన్ షాపుల తనిఖీ
ఏలూరు జిల్లా
మంగళవారం లింగపాలెం మండల తహశీల్దార్ నజిముల్లషా లింగపాలెం గ్రామంలోని రేషన్ షాపులను తనిఖీ చేశారు. ఒకటో నెంబర్ డీలర్ షాపులను తనిఖీ చేసి, డీలర్లకు కార్డుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలనీ, బియ్యాన్ని సక్రమంగా అందజేయాలనీ తెలియపరిచారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, డీలర్లను సాయంత్రం 9 గంటల వరకు షాపులను తెరిచి ఉంచాలని ఆదేశించారు. రేషన్ షాపులో ఇచ్చే బియ్యాన్ని గర్భిణీ స్త్రీలు కూడా తినవచ్చని, దీంట్లో ప్రోటీన్స్ ఉన్నాయని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో లింగపాలెం మండల డీలర్ల సంఘం అధ్యక్షులు చిట్లూరి వరప్రసాద్ (చినబాబు) పాల్గొన్నారు.