www.ntodaynews.com
లక్సెట్టిపేట రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
తెలంగాణ
/
మంచిర్యాల
/
లక్సెట్టిపేట
లక్సెట్టిపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
లక్సెట్టిపేట: మండల పరిధిలోని ఇటిక్యాల-తిమ్మాపూర్ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇటిక్యాల గ్రామానికి చెందిన మేడి అశోక్ అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. తన వాహనంపై వెళ్తుండగా ఒక మలుపు వద్ద వాహనం అదుపు తప్పి కిందపడిపోవడంతో, తీవ్ర గాయాలైన అశోక్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు; ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు