www.ntodaynews.com
లక్ష్మీపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామం సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారుమంచి హరికృష్ణ ప్రసాద్ (60) మృతి చెందారు. అదే కారులో ప్రయాణిస్తున్న ఆయన భార్య భవానికి తీవ్ర గాయాలయ్యాయి.
మంగళగిరి నుంచి చింతలపాడు వైపు వెళ్తుండగా వారి కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణ ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా, భవానిని ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు.
మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తిరువూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.