www.ntodaynews.com
రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ పంచాయతీరాజ్ అధికారులు
ఆంధ్రప్రదేశ్
/
విజయనగరం
లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ పంచాయతీరాజ్ అధికారులు
విజయనగరం జిల్లా: అవినీతి బారిన పడిన పంచాయతీరాజ్ శాఖ మరోసారి వార్తల్లో నిలిచింది. గజపతినగరం పంచాయతీరాజ్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు ఏసీబీకి చిక్కారు.
మెంటాడ గ్రామానికి చెందిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు క్లియర్ చేయడానికి సర్పంచ్ రాంబాబు నుంచి రూ.1.20 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో జేఈ గౌతమ్, వర్క్ ఇన్స్పెక్టర్ కలిసి డబ్బు స్వీకరిస్తుండగా, ముందస్తు సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఈ ఘటనతో స్థానికంగా సంచలనం రేగింది. పట్టుబడ్డ అధికారులపై కేసు నమోదు చేసి, విచారణ కొనసాగుతున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.