BREAKING
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు
Date of Publish : 08 March 2026, 01:04 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పంటలకు చివరి తడి నీరు విడుదల

తెలంగాణ
08 Mar, 2026 - 01:04 AM
186 వీక్షణలు
కేసీ కెనాల్ క్రింద ఆరుతడి పంటలకు చివరి తడి నీరు విడుదల: మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి చొరవ NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున కేసీ కెనాల్ క్రింద సాగు చేసిన ఆరుతడి పంటలకు చివరి తడి నీరు విడుదల చేయాలని పాములపాడు మండల రైతులు టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డికు వినతి చేశారు. ఆదివారం పాములపాడు, ఎర్రగూడూరు, శాంతినగరం, కంబాలపల్లె, రుద్రవరం తదితర గ్రామాల రైతులు రుద్రవరం గ్రామంలో బైరెడ్డి రాజశేఖరరెడ్డిని కలిసి తమ సమస్యను వివరించారు. ప్రభుత్వం సూచించిన విధంగా కేసీ కెనాల్ క్రింద ఉన్న ఆయకట్టు భూముల్లో మొక్కజొన్న, మినుములు, పెసర, జొన్న వంటి ఆరుతడి పంటలు సాగు చేశామని తెలిపారు. పొలాలకు చివరి తడి నీరు అందకపోతే పంటలు ఎండిపోతాయని, తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యపై వెంటనే స్పందించిన బైరెడ్డి రాజశేఖరరెడ్డి కేసీ కెనాల్ ఈఈ ప్రతాప్తో ఫోన్ ద్వారా మాట్లాడి రైతుల పరిస్థితిని వివరించారు. దీనికి స్పందించిన ఈఈ ప్రతాప్ పాములపాడు మండలం మీదుగా అలగనూరు రిజర్వాయర్‌కు వెళ్లే కాల్వకు నీటి విడుదలకు అంగీకరించి నీటిని విడుదల చేయించారు. దీంతో పాములపాడు మండలానికి చెందిన రైతులు కురువ రమేష్, గాండ్ల సాయి, కురువ వెంకటేశ్వర్లు, హనుమంతు, మల్లికార్జున, ఈశ్వరయ్య తదితరులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. #KC Canal #FarmersIssue #ByreddyRajasekharReddy #Pamulapadu #AndhraPradeshNews #Agriculture #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube