BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

పంటలకు చివరి తడి నీరు విడుదల

తెలంగాణ
08 Mar, 2026 - 01:04 AM
143 వీక్షణలు
కేసీ కెనాల్ క్రింద ఆరుతడి పంటలకు చివరి తడి నీరు విడుదల: మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి చొరవ NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున కేసీ కెనాల్ క్రింద సాగు చేసిన ఆరుతడి పంటలకు చివరి తడి నీరు విడుదల చేయాలని పాములపాడు మండల రైతులు టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డికు వినతి చేశారు. ఆదివారం పాములపాడు, ఎర్రగూడూరు, శాంతినగరం, కంబాలపల్లె, రుద్రవరం తదితర గ్రామాల రైతులు రుద్రవరం గ్రామంలో బైరెడ్డి రాజశేఖరరెడ్డిని కలిసి తమ సమస్యను వివరించారు. ప్రభుత్వం సూచించిన విధంగా కేసీ కెనాల్ క్రింద ఉన్న ఆయకట్టు భూముల్లో మొక్కజొన్న, మినుములు, పెసర, జొన్న వంటి ఆరుతడి పంటలు సాగు చేశామని తెలిపారు. పొలాలకు చివరి తడి నీరు అందకపోతే పంటలు ఎండిపోతాయని, తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యపై వెంటనే స్పందించిన బైరెడ్డి రాజశేఖరరెడ్డి కేసీ కెనాల్ ఈఈ ప్రతాప్తో ఫోన్ ద్వారా మాట్లాడి రైతుల పరిస్థితిని వివరించారు. దీనికి స్పందించిన ఈఈ ప్రతాప్ పాములపాడు మండలం మీదుగా అలగనూరు రిజర్వాయర్‌కు వెళ్లే కాల్వకు నీటి విడుదలకు అంగీకరించి నీటిని విడుదల చేయించారు. దీంతో పాములపాడు మండలానికి చెందిన రైతులు కురువ రమేష్, గాండ్ల సాయి, కురువ వెంకటేశ్వర్లు, హనుమంతు, మల్లికార్జున, ఈశ్వరయ్య తదితరులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. #KC Canal #FarmersIssue #ByreddyRajasekharReddy #Pamulapadu #AndhraPradeshNews #Agriculture #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube