BREAKING
ఏలూరు జిల్లాలో కలకలం.. జీడిమామిడి తోటలో తల్లీకూతుళ్ల మృతదేహాలు ఏఎన్‌ఎం ఉద్యోగం రాలేదని దివ్యాంగురాలి ఆత్మహత్యాయత్నం మయన్మార్ అధ్యక్షుడితో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో విధ్వంసం.. 18 మంది అరెస్ట్ ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్‌పై రాజకీయ రచ్చ..! నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొన్న mla రాకేష్ రెడ్డి.. ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు ​తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏలూరు జిల్లాలో కలకలం.. జీడిమామిడి తోటలో తల్లీకూతుళ్ల మృతదేహాలు ఏఎన్‌ఎం ఉద్యోగం రాలేదని దివ్యాంగురాలి ఆత్మహత్యాయత్నం మయన్మార్ అధ్యక్షుడితో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో విధ్వంసం.. 18 మంది అరెస్ట్ ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్‌పై రాజకీయ రచ్చ..! నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొన్న mla రాకేష్ రెడ్డి.. ఏపీలో కొత్త పెన్షన్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ​తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు ​తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
www.ntodaynews.com

పంటలకు చివరి తడి నీరు విడుదల

తెలంగాణ
08 Mar, 2026 - 01:04 AM
92 వీక్షణలు
కేసీ కెనాల్ క్రింద ఆరుతడి పంటలకు చివరి తడి నీరు విడుదల: మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి చొరవ NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున కేసీ కెనాల్ క్రింద సాగు చేసిన ఆరుతడి పంటలకు చివరి తడి నీరు విడుదల చేయాలని పాములపాడు మండల రైతులు టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డికు వినతి చేశారు. ఆదివారం పాములపాడు, ఎర్రగూడూరు, శాంతినగరం, కంబాలపల్లె, రుద్రవరం తదితర గ్రామాల రైతులు రుద్రవరం గ్రామంలో బైరెడ్డి రాజశేఖరరెడ్డిని కలిసి తమ సమస్యను వివరించారు. ప్రభుత్వం సూచించిన విధంగా కేసీ కెనాల్ క్రింద ఉన్న ఆయకట్టు భూముల్లో మొక్కజొన్న, మినుములు, పెసర, జొన్న వంటి ఆరుతడి పంటలు సాగు చేశామని తెలిపారు. పొలాలకు చివరి తడి నీరు అందకపోతే పంటలు ఎండిపోతాయని, తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యపై వెంటనే స్పందించిన బైరెడ్డి రాజశేఖరరెడ్డి కేసీ కెనాల్ ఈఈ ప్రతాప్తో ఫోన్ ద్వారా మాట్లాడి రైతుల పరిస్థితిని వివరించారు. దీనికి స్పందించిన ఈఈ ప్రతాప్ పాములపాడు మండలం మీదుగా అలగనూరు రిజర్వాయర్‌కు వెళ్లే కాల్వకు నీటి విడుదలకు అంగీకరించి నీటిని విడుదల చేయించారు. దీంతో పాములపాడు మండలానికి చెందిన రైతులు కురువ రమేష్, గాండ్ల సాయి, కురువ వెంకటేశ్వర్లు, హనుమంతు, మల్లికార్జున, ఈశ్వరయ్య తదితరులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. #KC Canal #FarmersIssue #ByreddyRajasekharReddy #Pamulapadu #AndhraPradeshNews #Agriculture #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube