లవ్ జిహాదీ సాధిక్ను కఠినంగా శిక్షించాలి..
లవ్ జిహాదీ సాధిక్ను కఠినంగా శిక్షించాలి.. నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలి
తిరువూరు: నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలని, సాధిక్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు తిరువూరు పోలీస్ స్టేషన్లో వినతిపత్రం అందజేశారు.
భారతీయ జనతా పార్టీ తిరువూరు పట్టణ అధ్యక్షుడు వెంపాటి అబ్రహాం మణిరత్నం ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సూచనల మేరకు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షురాలు పోలే శాంతి సూచనలతో తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు, అర్బన్ ఎస్సై శ్వేత కర్ణి సమక్షంలో వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నూకరాజు కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఘటనకు కారణమైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ తిరువూరు పట్టణ మాజీ అధ్యక్షుడు నాగుబండి ప్రభాకర్ రావు, మైనార్టీ మోర్చా జిల్లా కార్యదర్శి షేక్ రాజా మహమ్మద్, యువమోర్చా పట్టణ అధ్యక్షుడు గంట మహేష్ తదితరులు పాల్గొన్నారు.