www.ntodaynews.com
మానవత్వం చాటుకున్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
మానవత్వం చాటుకున్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
నడవలేని స్థితిలో తమ బాధలు చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధుల పట్ల ఎస్పీ ప్రత్యేక సానుభూతిని కనబరిచారు. వారు తనవద్దకు వచ్చే వరకు వేచి చూడకుండా, వృద్ధుల వద్దకే స్వయంగా వెళ్లి వారి ఫిర్యాదులను స్వీకరించి భరోసా కల్పించారు. కలికిరి మండలం కె.కొత్తపల్లికి చెందిన తుమ్మలపల్లి మల్లమ్మ అనే వృద్ధురాలి సమస్యను సావధానంగా విని, చట్ట పరిధిలో వెంటనే పరిష్కారం చూపాలని కలికిరి సీఐని ఆదేశించారు. అలాగే, మదనపల్లెలోని ఈశ్వర్ కాలనీకి చెందిన షేక్ గౌస్ సాహెబ్ ఎస్పీ గారికి తన సమస్యను విన్నవించుకోగా, దానిని సత్వరమే చట్టపరిధిలో పరిష్కరించాలని మదనపల్లె తాలూకా సీఐకి ఆదేశాలు జారీ చేశారు. బాధితుల పక్షాన నిలబడి వారికి అండగా ఉండటమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని ఈ సందర్భంగా ఎస్పీ గుర్తుచేశారు.