BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

మార్చి మృతులకు కూడా ఇన్సూరెన్స్ కోసం పోరాటం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Mar, 2026 - 06:28 AM
150 వీక్షణలు

మార్చిలో మృతి చెందిన జనసేన కార్యకర్తలకు ఇన్సూరెన్స్ వర్తింపుపై చర్యలు: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ

ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో జనసేన సభ్యత్వాలు నమోదు చేసుకున్న కార్యకర్తలందరికీ ఏప్రిల్ 1 నుంచి ఇన్సూరెన్స్ అమల్లోకి రానున్న నేపథ్యంలో ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు కూడా ఈ సదుపాయం వర్తింపజేయాలని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా మార్చి నెలలో పలువురు జనసేన కార్యకర్తలు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ సమస్యను జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ సందర్భంగా కైకలూరు మండలం చటకాయ్ గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘంటసాల పెదరాముడు కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ పరామర్శించారు. బాధిత కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చి వారికి సానుభూతి వ్యక్తం చేశారు.