మార్చి మృతులకు కూడా ఇన్సూరెన్స్ కోసం పోరాటం
మార్చిలో మృతి చెందిన జనసేన కార్యకర్తలకు ఇన్సూరెన్స్ వర్తింపుపై చర్యలు: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో జనసేన సభ్యత్వాలు నమోదు చేసుకున్న కార్యకర్తలందరికీ ఏప్రిల్ 1 నుంచి ఇన్సూరెన్స్ అమల్లోకి రానున్న నేపథ్యంలో ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు కూడా ఈ సదుపాయం వర్తింపజేయాలని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా మార్చి నెలలో పలువురు జనసేన కార్యకర్తలు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ సమస్యను జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ సందర్భంగా కైకలూరు మండలం చటకాయ్ గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘంటసాల పెదరాముడు కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ పరామర్శించారు. బాధిత కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చి వారికి సానుభూతి వ్యక్తం చేశారు.