BREAKING
గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం
www.ntodaynews.com

మడుపల్లి పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థినులకు కెనరా బ్యాంక్ స్కాలర్‌షిప్‌లు

తెలంగాణ
/ తెలంగాణ / ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 06:45 PM
13 వీక్షణలు

మడుపల్లి పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థినులకు కెనరా బ్యాంక్ స్కాలర్‌షిప్‌లు

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర మండలం మడుపల్లి:

పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్ మడుపల్లి పాఠశాలలో ప్రతిభ కనబరిచిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు కెనరా బ్యాంక్ మధిర శాఖ ఆధ్వర్యంలో నగదు స్కాలర్‌షిప్‌లను బుధవారం అందజేశారు.

గత విద్యా సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ సాధించిన విద్యార్థినులను గుర్తించి ఈ స్కాలర్‌షిప్‌లను అందించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోట నరసింహారావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా కెనరా బ్యాంక్ మధిర శాఖ మేనేజర్ బాబ్జి హాజరై విద్యార్థినులకు స్వయంగా నగదు పురస్కారాలను అందించారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ఇలాంటి స్కాలర్‌షిప్‌లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్న కెనరా బ్యాంక్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

స్కాలర్‌షిప్‌లు పొందిన విద్యార్థినులు:

మేడా వైష్ణవి – 10వ తరగతి – రూ.5,000

మోదుగు సంజన – 9వ తరగతి – రూ.5,000

యేసుపోగు షారోన్ – 8వ తరగతి – రూ.5,000

జక్కి అక్షయ – 7వ తరగతి – రూ.3,000

కనకపూడి నిహారిక – 6వ తరగతి – రూ.3,000

యేసుపోగు సవిత – 5వ తరగతి (పీఎస్ మడుపల్లి) – రూ.3,000

స్కాలర్‌షిప్‌లు అందుకున్న విద్యార్థినులు, ఉపాధ్యాయులు కెనరా బ్యాంక్ మధిర శాఖ మేనేజర్‌కు, బ్యాంక్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.