మడుపల్లి పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థినులకు కెనరా బ్యాంక్ స్కాలర్షిప్లు
మడుపల్లి పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థినులకు కెనరా బ్యాంక్ స్కాలర్షిప్లు
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మధిర మండలం మడుపల్లి:
పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ మడుపల్లి పాఠశాలలో ప్రతిభ కనబరిచిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు కెనరా బ్యాంక్ మధిర శాఖ ఆధ్వర్యంలో నగదు స్కాలర్షిప్లను బుధవారం అందజేశారు.
గత విద్యా సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ సాధించిన విద్యార్థినులను గుర్తించి ఈ స్కాలర్షిప్లను అందించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోట నరసింహారావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా కెనరా బ్యాంక్ మధిర శాఖ మేనేజర్ బాబ్జి హాజరై విద్యార్థినులకు స్వయంగా నగదు పురస్కారాలను అందించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ఇలాంటి స్కాలర్షిప్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్న కెనరా బ్యాంక్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
స్కాలర్షిప్లు పొందిన విద్యార్థినులు:
మేడా వైష్ణవి – 10వ తరగతి – రూ.5,000
మోదుగు సంజన – 9వ తరగతి – రూ.5,000
యేసుపోగు షారోన్ – 8వ తరగతి – రూ.5,000
జక్కి అక్షయ – 7వ తరగతి – రూ.3,000
కనకపూడి నిహారిక – 6వ తరగతి – రూ.3,000
యేసుపోగు సవిత – 5వ తరగతి (పీఎస్ మడుపల్లి) – రూ.3,000
స్కాలర్షిప్లు అందుకున్న విద్యార్థినులు, ఉపాధ్యాయులు కెనరా బ్యాంక్ మధిర శాఖ మేనేజర్కు, బ్యాంక్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.