మద్యం మత్తులో హల్చల్ చేసిన సినీ హీరో మాజీ ప్రియురాలు లావణ్య
మద్యం మత్తులో హల్చల్ చేసిన సినీ హీరో మాజీ ప్రియురాలు లావణ్య
సంగారెడ్డి జిల్లాలో సంచలనం రేపిన ఘటనలో సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో హంగామా చేసినట్టు సమాచారం.
మల్కాపూర్ మండలం మల్లేపల్లి వద్ద లావణ్య కారు బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం ఆగకుండా వెళ్లిపోవడానికి ప్రయత్నించగా గ్రామస్థులు కారును అడ్డుకున్నారు. సారీ చెప్పాలని కోరగా, ఆమె వారితో వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది.
ఈ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు. గ్రామస్థుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులతో కూడా లావణ్య కొంతసేపు వాగ్వాదానికి దిగినట్టు సమాచారం.
డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో లావణ్యకు పాజిటివ్ రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
కారులో మద్యం బాటిళ్లు ఉన్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.