మధిర: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టు.. దరఖాస్తులకు ఆహ్వానం
మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గణితశాస్త్రంలో అతిథి అధ్యాపకుడి నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. ఎం. రవీంద్రారెడ్డి తెలిపారు.
అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 8వ తేదీ మంగళవారం నుంచి 9వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలలోపు దరఖాస్తులను మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అందజేయాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పీజీలో కనీసం 50 శాతం మార్కులు, ఇతర అభ్యర్థులకు పీజీలో కనీసం 55 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. పీహెచ్డీ, నెట్, సెట్ అర్హత కలిగిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అలాగే బోధన అనుభవానికి వెయిటేజీ ఉంటుందని వివరించారు.
ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈనెల 11వ తేదీన ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు.
మరిన్ని వివరాల కోసం 9440257256, 9441786508, 9553359879, 9177734879 నంబర్లను సంప్రదించాలని కళాశాల యాజమాన్యం సూచించింది.