BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

మధ్యాహ్న భోజన పథకం భోజనాలు విద్యార్థులు సంతృప్తికరంగా భుజించాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 11:29 PM
95 వీక్షణలు

మధ్యాహ్న భోజన పథకం భోజనాలు విద్యార్థులు సంతృప్తికరంగా భుజించాలి  నాణ్యతలో చిన్న లోటు ఉన్నా చర్యలు తప్పవు: మంత్రి కొలుసు పార్థసారథి

ఆగిరిపల్లి, మార్చి 25: ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి బుధవారం అకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు.

విద్యార్థులతో భోజనం చేస్తూ ఉపాధ్యాయులు పాఠాలు ఎలా బోధిస్తున్నారో, భోజనం నాణ్యత ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. భోజనం పట్ల విద్యార్థులు సంతృప్తిగా ఉన్నారని మంత్రి తెలిపారు.

మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఎదగాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ‘డొక్కా సీతమ్మ’ పేరుతో పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదన్నారు. విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రతిరోజూ మధ్యాహ్న భోజన నాణ్యతను ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా పరిశీలించాలని ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు. భోజన నాణ్యతలో ఎక్కడైనా లోపాలు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గత ఐదేళ్లలో నిలిచిపోయిన ఉపాధ్యాయుల భర్తీని కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసిందని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంధిపాము శారద, విద్యా కమిటీ చైర్మన్ కంచిర్ల అంజయ్య, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, నాన్-టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.