BREAKING
గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
Date of Publish : 25 March 2026, 11:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధ్యాహ్న భోజన పథకం భోజనాలు విద్యార్థులు సంతృప్తికరంగా భుజించాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 11:29 PM
131 వీక్షణలు

మధ్యాహ్న భోజన పథకం భోజనాలు విద్యార్థులు సంతృప్తికరంగా భుజించాలి  నాణ్యతలో చిన్న లోటు ఉన్నా చర్యలు తప్పవు: మంత్రి కొలుసు పార్థసారథి

ఆగిరిపల్లి, మార్చి 25: ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి బుధవారం అకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు.

విద్యార్థులతో భోజనం చేస్తూ ఉపాధ్యాయులు పాఠాలు ఎలా బోధిస్తున్నారో, భోజనం నాణ్యత ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. భోజనం పట్ల విద్యార్థులు సంతృప్తిగా ఉన్నారని మంత్రి తెలిపారు.

మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఎదగాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ‘డొక్కా సీతమ్మ’ పేరుతో పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదన్నారు. విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రతిరోజూ మధ్యాహ్న భోజన నాణ్యతను ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా పరిశీలించాలని ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు. భోజన నాణ్యతలో ఎక్కడైనా లోపాలు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గత ఐదేళ్లలో నిలిచిపోయిన ఉపాధ్యాయుల భర్తీని కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసిందని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంధిపాము శారద, విద్యా కమిటీ చైర్మన్ కంచిర్ల అంజయ్య, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, నాన్-టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.