మెడిసిన్ ధరలకు రెక్కలు… ప్రజలకు భారీ షాక్!
మెడిసిన్ ధరలకు రెక్కలు… ప్రజలకు భారీ షాక్!
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఔషధ రంగంపై తీవ్రంగా పడింది. మందుల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో వాటి ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం ముడి పదార్థాల ధరలు 200 నుంచి 300 శాతం వరకు పెరిగినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో దేశంలో మెడిసిన్ ధరలు గరిష్ఠంగా 180 శాతం వరకు పెరగనున్నాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే ఈ పెంపుపై అధికారిక ప్రకటన చేసే దిశగా ఫార్మా కంపెనీలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
పారాసెటమాల్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, బీపీ మందులు వంటి సాధారణంగా ప్రజలు ఎక్కువగా వినియోగించే ఔషధాల ధరలు భారీగా పెరగనున్నాయి. దీంతో సాధారణ ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరగనుంది.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఈ ధరల పెరుగుదలతో మరింత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొననుంది.
మొత్తానికి, మెడిసిన్ ధరల పెరుగుదల ప్రజల జేబుకు గట్టి దెబ్బగా మారనుంది.