BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

నినాదాలు చేస్తే కేసులా?.. బాంబే హైకోర్టు ఆగ్రహం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jul, 2026 - 09:33 PM
19 వీక్షణలు

ముంబై, జూలై 4: బీజేపీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఓ వ్యక్తిపై నమోదు చేసిన కేసును బాంబే హైకోర్టు కొట్టివేసింది. రాజకీయ నినాదాలు చేసినందుకు ఒక వ్యక్తిపై పోలీసులు బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది.

ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ మాధవ్ జామ్దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం నేరం కాదని స్పష్టం చేశారు. ప్రజల నిరసనలను అణచివేయడానికి వరుసగా కేసులు నమోదు చేయడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.

"ప్రజలు ప్రశ్నలు అడగడం నేరం కాదు. అది ప్రతి పౌరుడి బాధ్యత. పౌరులందరినీ ప్రభుత్వానికి బానిసలుగా మారుస్తున్నారా? నినాదాలు చేస్తే కేసులు పెడతారా?" అంటూ పోలీసులను న్యాయమూర్తి ప్రశ్నించినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి.

విద్యార్థుల ఆత్మహత్యలు, నీట్ పరీక్షలో అక్రమాలు వంటి కీలక సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అధికార యంత్రాంగం, రాజకీయ నినాదాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం ఆందోళనకరమని జస్టిస్ మాధవ్ జామ్దార్ వ్యాఖ్యానించారు.

నిరసన వ్యక్తం చేయడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని, ఆ హక్కును అణచివేసే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసిన హైకోర్టు, సంబంధిత కేసుతో పాటు బహిష్కరణ ఉత్తర్వులను కూడా రద్దు చేసింది.