BREAKING
రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు
www.ntodaynews.com

మీకోసం కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలకు చట్ట పరిధిలో పరిష్కారం అందించాలి: కృష్ణా జిల్లా ఎస్పీ

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 08:06 PM
15 వీక్షణలు

మచిలీపట్నం, జూలై 6: కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన "మీకోసం" ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోలీస్ కార్యాలయానికి వచ్చినప్పుడు వారికి ఆత్మీయత, మర్యాద, సహానుభూతితో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదుదారుల సమస్యలను చిరునవ్వుతో స్వీకరించి, వారి బాధను ఓర్పుతో వింటే వారు మానసికంగా ఎంతో ఊరట పొందుతారని అన్నారు.

ప్రతి ఫిర్యాదుదారునితో మనస్ఫూర్తిగా మాట్లాడి, వారి సమస్యను పూర్తిగా తెలుసుకుని, చట్ట పరిధిలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని నమ్మకం కలిగించాలని ఎస్పీ తెలిపారు. ప్రజలకు పోలీసు శాఖపై విశ్వాసం మరింత పెరిగేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

మీకోసం కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 50 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించి, వాటిని సంబంధిత అధికారులకు పంపించి చట్ట ప్రకారం విచారణ జరిపి తగిన పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు.