మెట్ట ప్రాంతంలో ఇండ్ల స్థలాలు ఇచ్చి మమ్మల్ని రక్షించండి
మెట్ట ప్రాంతంలో ఇండ్ల స్థలాలు ఇచ్చి మమ్మల్ని రక్షించండి
మా ఊరు ముంపు ప్రాంతం భారీ వర్షాలు వస్తే ఖాళీ చేయాల్సిందే
డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందించిన బాల గురవయ్య గారిపల్లి గ్రామస్తులు
ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చిన డిప్యూటీ తాసిల్ద
పుంగనూరు మండలం బాల గురవయ్య గారి పల్లి హరిజనవాడకు చెందిన ప్రజలు ఇళ్ల స్థలాల కోసం పుంగనూరు డిప్యూటీ తాసిల్దార్ కు వినతిపత్రం అందించారు, అనంతరం మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు మాధవరెడ్డికి మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ కచ్చితంగా మీ సమస్యను మీకు ఇల్ల పట్టాలు ఇచ్చే విషయంపై మన పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి అయినటువంటి చల్లా రామచంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి కచ్చితంగా మీకు పట్టాలిచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు, గ్రామస్తులు ఈ విధంగా మాట్లాడుతూ మా గురవయ్య గారి పల్లి కు రాయల్ చెరువు పుంగమ్మ చెరువు సుబ్బమ్మ చెరువు ప్రతి సంవత్సరం భారీ వర్షాలకు ఆ చెరువుల నుండి వచ్చే వరద నీరు మా ఊరి పైన రావడంతో మేమంతా భయపడి పిల్లాపాపను పశువులు గోదాంతో ఎత్తుకొని పక్క గ్రామాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉందని, గతంలో ఎన్నోసార్లు అలా జరిగాయని అలా జరగకుండా మాకు శాశ్వత పరిష్కారం కోసం అగ్రహారం వద్ద గల బండపై మా గ్రామానికి పట్టాలు ఇచ్చినట్లయితే వరదలు వచ్చినప్పుడు భయపడకుండా అక్కడ కు వెళ్లి నివాసం ఉంటామని కావున మాపై దయవుంచి మాకు పట్టాలి ఇప్పించాలని ప్రభుత్వ అధికారులను రాజకీయ నాయకులను కోరుతున్నారు.